మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ దృష్టి..
- December 12, 2018తెలంగాణ:ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టింది టీఆర్ఎస్. రేపు ఉదయం 8గంటలకు రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, కొద్దిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేసీఆర్ గవర్నర్ను కలిసి సమాచారమిచ్చారు.
ఇవాళ ఉదయం 11న్నర గంటలకు తెలంగాణ భవన్లో TRS-LP సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు… మరోవైపు మంత్రివర్గ కూర్పపై కేసీఆర్ దృష్టిపెట్టారు. పలువురి పేర్లను ఆయన పరిశీలించినట్లు సమాచారం. నలుగురు మంత్రులు ఓడిపోయినందున వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం.. ప్రస్తుతం ఉన్నవారిలో కొందరిని మార్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది..
ప్రభుత్వం ఏర్పడ్డాక శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.. ఇందుకోసం ప్రోటెం స్పీకర్గా రెడ్యానాయక్ను నియమించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోవడంతో ఆయన స్థానంలో కొత్త స్పీకర్ను ఎన్నుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి