ఫేస్బుక్కు బాంబు బెదిరింపు..కొన్ని భవనాలను ఖాళీ చేయించినట్లు ప్రకటన
- December 12, 2018
కాలిఫోర్నియా: అమెరికాలోని ఫేస్బుక్ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో కాలిఫోర్నియా రాష్ట్రంలోని మెన్లో పార్క్ నగరంలోని ఫేస్బుక్ ప్రధాన ప్రాంగణంలో కొన్ని భవనాలను ఖాళీ చేయించారు. ప్రాంగణంలోని 200 జెఫ్ఫర్సన్ డ్రైవ్ భవనంలో బాంబు ఉందన్న అనుమానంతో ఉద్యోగులందర్నీ బయటకు పంపేసినట్లు ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఒకరు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఉద్యోగులంతా క్షేమంగానే ఉన్నారని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో ఫేస్బుక్ వెల్లడించింది. భవనంలో అణవణువు పరిశీలిస్తున్నట్లు మెన్లో పార్క్ పోలీసులు ట్విటర్ ద్వారా తెలిపారు. గతంలో యూట్యూబ్ సంస్థ కూడా భద్రతా పరమైన ఇలాంటి సమస్యే ఎదుర్కొంది. ఈ ఏడాది మేలో శాన్ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ ప్రధాన కార్యాలయంలో ఈ లోపం బయటపడింది. ఓ మహిళ ముగ్గురు వ్యక్తులపై తుపాకీతో కాల్పులు జరిపి, తర్వాత తనను తాను కాల్చేసుకొని చనిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తూటాల గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







