క్యుఎన్సిసిలో భారత సింగర్ ప్రదర్శన
- December 13, 2018దోహా: భారత మెలోడీ కింగ్ కుమార్ సాను, ఖతార్ రెసిడెంట్స్ని తన పాటలతో అలరించనున్నారు. ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 28న కుమార్ సాను సంగీత విభావరి జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఈవెంట్ని నిర్వహించనున్నారు. 'ఏ కాలి కాలి ఆంకేన్, ఏక్ లడ్కి కో దేఖా, ఆంకో కి గుస్తాకియాన్..' వంటి ఎన్నో అద్భుతమైన పాటలతో కుమార్ సాను, బాలీవుడ్ మెలోడీ కింగ్ అన్పించుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం పద్మ పురస్కారంతో కుమార్ సానుని గౌరవించింది. 24 గంటల్లో అత్యధిక పాటల్ని పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు దక్కించుకున్నారు కుమార్ సాను. కాగా, కుమార్ సాను సంగీత విభావరికి వెళ్ళాలనుకునేవారికి 75 ఖతారీ రియాల్స్ నుంచి 300 ఖతారీ రియాల్స్ ధరల్లో టిక్కెట్లు అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ