పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన కేసీఆర్..
- December 24, 2018
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఆదివారం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చించిన ఆయన.. సోమవారం కోల్కతా వెళ్లనున్నారు. మమతా బెనర్జీతో ప్రత్యమ్నాయ కూటమి ప్రయత్నాలపై సమాలోచనలు జరుపుతారు.
ఇప్పటికే పలుమార్లు ఇద్దరి మధ్య చర్చలు జరిగినా, 2019 ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కేసీఆర్ రంగంలోకి దిగారు. తాము ఏ పార్టీకి బీ-టీమ్ కాదని స్పష్టం చేసిన గులాబీ బాస్.. గుణాత్మక మార్పుదిశగా అంతా కలిసి ముందడుగు వేస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యమ్నాయం ఉండాల్సిందేనని పునరుద్ఘాటించారు.
ఆదివారం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలోనే బస చేసిన కేసీఆర్.. సోమవారం భువనేశ్వర్ నుంచి కోణార్క్ వెళ్తున్నారు. అక్కడ ఆలయాల సందర్శన తర్వాత పూరీ జగన్నాథుని సన్నిధిలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత మళ్లీ భువనేశ్వర్ చేరుకుని అక్కడి నుంచి కోల్కతా వెళ్తారు. సోమవారం సాయంత్రం బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. కలకత్తా కాళీమాతను కూడా దర్శనం చేసుకున్నాక రాత్రికి అట్నుంచి ఢిల్లీ వెళ్తారు.
మగళవారం ఢిల్లీ కేంద్రంగా ఫ్రంట్ ఏర్పాట్లపై చర్చలు జరపనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్, మాయావతి ఇద్దరితోనూ విడివిడిగా సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారు. కేసీఆర్ ఏడాది కింద నుంచి దేశంలో ప్రత్యామ్నాయ కూటమి అవసరాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన ఆయన.. ఇప్పుడు దేశ రాజకీయాలపై దృష్టి పెట్టారు. రైతుబంధు లాంటి పథకాల్ని దేశమంతా అమలు చేయాలని ప్రతిపాదిస్తూనే, మిత్రపక్షాల్ని ఏకం చేసే బాధ్యత భుజానికెత్తుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







