నిర్బంధంలో వున్న భారతీయ మహిళకు ఊరట
- December 24, 2018
బహ్రెయిన్:భారతీయ వలస మహిళ ఒకరు అరబ్ వ్యక్తి నిర్బంధంలో వుండగా, ఆమెను లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ) అధికారులు విడిపించారు. అరబ్ వ్యక్తి, తాను ఆ మహిళను 'బానిస'గా కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్ని ఆ మహిళ సంప్రదించిన తర్వాత రెస్క్యూ చర్యలు ప్రారంభమయ్యాయి. ఇండియన్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ మినిస్టర్ అలాగే బహ్రెయిన్ అధికారులకు ముందుగా ఈ సమాచారాన్ని అందించారు. ఓ రూమ్లో మహిళను బంధించారు అరబ్ వ్యక్తి. సమాచారం గురించి తెలుసుకున్న భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, పరిస్థితి చాలా తీవ్రంగా వుందనీ, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని భారత రాయబారి అలోక్కుమార్ సిన్హాకి ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఇండియన్ ఎంబసీ, ఈ విషయంలో జోక్యం చేసుకుని, బహ్రెయిన్ అధికారులతో కలిసి బాధిత మహిళకు విముక్తి కల్పించారు.a
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







