నిర్బంధంలో వున్న భారతీయ మహిళకు ఊరట

- December 24, 2018 , by Maagulf
నిర్బంధంలో వున్న భారతీయ మహిళకు ఊరట

బహ్రెయిన్:భారతీయ వలస మహిళ ఒకరు అరబ్‌ వ్యక్తి నిర్బంధంలో వుండగా, ఆమెను లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్‌ఎంఆర్‌ఎ) అధికారులు విడిపించారు. అరబ్‌ వ్యక్తి, తాను ఆ మహిళను 'బానిస'గా కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. హ్యుమానిటేరియన్‌ ఆర్గనైజేషన్‌ని ఆ మహిళ సంప్రదించిన తర్వాత రెస్క్యూ చర్యలు ప్రారంభమయ్యాయి. ఇండియన్‌ ఎక్సటర్నల్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ అలాగే బహ్రెయిన్‌ అధికారులకు ముందుగా ఈ సమాచారాన్ని అందించారు. ఓ రూమ్‌లో మహిళను బంధించారు అరబ్‌ వ్యక్తి. సమాచారం గురించి తెలుసుకున్న భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, పరిస్థితి చాలా తీవ్రంగా వుందనీ, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని భారత రాయబారి అలోక్‌కుమార్‌ సిన్హాకి ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఇండియన్‌ ఎంబసీ, ఈ విషయంలో జోక్యం చేసుకుని, బహ్రెయిన్‌ అధికారులతో కలిసి బాధిత మహిళకు విముక్తి కల్పించారు.a

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com