ఇరాక్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆకస్మిక పర్యటన
- December 27, 2018బాగ్దాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. క్రిస్మస్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన సతీసమేతంగా ఆకస్మిక పర్యటన చేపట్టారు. అత్యంత రహస్యంగా ఇరాక్ వెళ్లిన ఆయన అక్కడ అమెరికా బలగాలను కలిశారు. సిరియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి దళాలను ఉపసంహరిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. ట్రంప్ ఈ పర్యటన చేపట్టడం విశేషం. మరోవైపు అమెరికా ప్రభుత్వం స్తంభించిన సమయంలో ట్రంప్ ఆకస్మిక పర్యటనకు వెళ్లడం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇరాక్లోని అల్ అసద్ ఎయిర్ బేస్లో ట్రంప్.. అమెరికా సైనికులను కలిశారు. అక్కడ వారిని ఉద్దేశించి మాట్లాడారు. సిరియా నుంచి వైదొలుగుతున్న విషయాన్ని ఆయన వారితో చెప్పారు. శాశ్వతంగా సిరియాకు వెళ్లాలన్న ఉద్దేశంతో మనం అక్కడకు వెళ్లలేదని, కేవలం మూడు నెలల టార్గెట్తో వెళ్లామని, కానీ ఎనిమిదేళ్లు అయినా అక్కడే ఉన్నామని, అందుకే దళాలను ఉపసంహరిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. భార్య మిలానీయాతో కలిసి ఇరాక్ వెళ్లిన ట్రంప్.. సిరియాలో మరో ఆరు నెలల ఉండాలని మిలిటరీ కమాండర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. ఇరాక్ నుంచి తిరుగు ప్రయాణంలో ట్రంప్.. జర్మనీలో ఉన్న అమెరికా సైనికులను కూడా కలిశారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం