పోలీస్ అధికారులపై దాడి: ఇద్దరు హౌస్ మెయిడ్స్కి జైలు
- January 10, 2019
హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు హౌస్మెయిడ్స్కి ఏడాది జైలు శిక్ష విధించింది. మహిళా పోలీస్ అధికారిపై ఈ ఇద్దరు మహిళలు దాడి చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. న్యాయస్థానం ఈ మేరకు నిందితులకు జైలు శిక్ష విధించడం జరిగింది. నిందితుల్లో ఒకరు ఆసియాకి చెందిన వ్యక్తి కాగా మరొకరు, ఇథియోపియాకి చెందిన వ్యక్తి. రెసిడెన్స్ స్టేటస్పై విచారణ చేస్తుండగా మహిళా అధికారిపై వీరు దాడి చేశారు. ఇద్దరూ అక్రమంగా కింగ్డమ్లో నివసిస్తున్నారు. ఇథియోపియన్ మహిళ ఓ అధికారపై దాడి చేయగా, ఆసియాకి చెందిన మరో మహిళ, ఇతర మహిళా అధికారులపై దాడికి దిగినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. నిందితులు, బాధిత మహిళా అధికారిని, ఇతర అధికారుల్ని దుర్భాషలాడారు. నిందితులకు జైలు శిక్ష అనంతరం, వారిని డిపోర్టేషన్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







