కోల్కతా సభకు హాజరైన నేతలు వీరే..
- January 19, 2019
కోల్కతా:మోడీ వ్యతిరేక విధానాలపై కోల్కతా వేదికగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో… విపక్షాలు సమర శంఖం పూరిస్తున్నాయి. కోల్కతాలో నిర్వహిస్తున్న యునైటెడ్ ఇండియా ర్యాలీలో బీజేపీయేతర పార్టీల అధినేతలు పాల్గొంటున్నారు. ఈ ర్యాలీకి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కర్ణాటక సీఎం కుమార స్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా, డీఎంకే నేత స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్తో పాటు కాంగ్రెస్ తరఫున ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వ పాల్గొంటున్నారు. దాదాపు 20 పార్టీల నేతలు ఈ ర్యాలీకి హాజరయ్యాయి. అటు.. ఈ ర్యాలీగా భారీగా జనం తరలివచ్చారు.
అటు.. కోల్కతాలో జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీయేతర కూటమి తదుపరి కార్యాచరణపై గత అర్థరాత్రి వరకు చర్చలు జరిపిన సీఎం….ఇవాళ కూడా పలువురు నేతలతో విడివిడిగా సంప్రదింపులు జరిపారు. ఉదయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాతో చంద్రబాబు భేటీ అయ్యారు. మమత ర్యాలీ అనంతరం చంద్రబాబు నేతృత్వంలో 20పార్టీల నేతలు భేటీ కానున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







