వలస ఉద్యోగస్తులని హడలెత్తిస్తున్న కువైట్
- January 20, 2019
కువైట్ దేశానికి వలస వెళ్లి ఉద్యోగం చేస్తున్న ఇతర దేశాలకు చెందిన వారికి ఆ దేశ ప్రభుత్వం తేరుకోలేని షాకివ్వనుంది. వలస ఉద్యోగులను క్రమంగా తొలగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వలసదారులను ఎట్టి పరిస్థతుల్లోనూ 2028 నాటికి పూర్తిగా తొలగించేయాలని భావిస్తోంది.
అదేవిధంగా ప్రైవేటు రంగంలో కనీసం 30 శాతం నుంచి 60 శాతం వరకు స్వదేశీ ఉద్యోగులే ఉండేలా జీవోను జారీచేయనుంది. వలసదారులకు ఉద్యోగాలివ్వడం వల్ల కువైట్ వాసుల భవితవ్యం దెబ్బతింటోందని, వారు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కఠిన చర్యలకు ఉపక్రమించాలని భావిస్తోంది.
ప్రస్తుతం కువైట్ బ్యాంకింగ్ రంగంలో 66 శాతం వలసదారులే పని చేస్తున్నారని, వీరిని తొలగించి వారి స్థానాలను కువైట్ వాసులకు ఇవ్వాలని యోచిస్తోంది. దీనికోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రభుత్వం.. ఈ యేడాది కనీసం 8 వేల మంది వలసదారులను తొలగించి వారి స్థానాలను స్వదేశీయులతో భర్తీ చేయనుంది. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కువైట్ వాసులు 26వేల మంది ఉండగా, వలసదారులు 83 వేల మంది ఉండటం గమనార్హం.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







