బరిలోకి దిగిన ప్రియాంక పై 'పాత్రా' ఏమన్నారో చూడండి
- January 23, 2019
న్యూఢిల్లీ: ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీ స్పందించింది. మొత్తానికి రాహుల్ గాంధీ ఫెయిలైనట్లు ప్రియాంకా ఎంట్రీతో కాంగ్రెస్ అంగీకరించిందని బీజేపీ సెటైర్ వేసింది. మహాకూటమి కోసం ప్రయత్నించినా చాలా వరకు పార్టీలు నో చెప్పడంతో చివరికి రాహుల్ కుటుంబ కూటమి వైపు మొగ్గు చూపారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. యూపీ ఈస్ట్కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమించిన వెంటనే బీజేపీ ఇలా కౌంటర్ ఇచ్చింది. ఆ కుటుంబం నుంచే మరో వ్యక్తిని తెరపైకి తీసుకురావడం ఊహించిందే అని పాత్రా అన్నారు. కాంగ్రెస్కు కాబోయే అధ్యక్షులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీలో అన్ని నియామకాలు ఆ ఒక్క కుటుంబం నుంచే జరిగాయి. కాంగ్రెస్, బీజేపీలకు మధ్య ఉన్న తేడా అదే. కాంగ్రెస్లో కుటుంబమే పార్టీ, బీజేపీకి పార్టీయే కుటుంబం అని సంబిత్ పాత్రా అన్నారు.
తాజా వార్తలు
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!







