బరిలోకి దిగిన ప్రియాంక పై 'పాత్రా' ఏమన్నారో చూడండి
- January 23, 2019
న్యూఢిల్లీ: ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై బీజేపీ స్పందించింది. మొత్తానికి రాహుల్ గాంధీ ఫెయిలైనట్లు ప్రియాంకా ఎంట్రీతో కాంగ్రెస్ అంగీకరించిందని బీజేపీ సెటైర్ వేసింది. మహాకూటమి కోసం ప్రయత్నించినా చాలా వరకు పార్టీలు నో చెప్పడంతో చివరికి రాహుల్ కుటుంబ కూటమి వైపు మొగ్గు చూపారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. యూపీ ఈస్ట్కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమించిన వెంటనే బీజేపీ ఇలా కౌంటర్ ఇచ్చింది. ఆ కుటుంబం నుంచే మరో వ్యక్తిని తెరపైకి తీసుకురావడం ఊహించిందే అని పాత్రా అన్నారు. కాంగ్రెస్కు కాబోయే అధ్యక్షులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీలో అన్ని నియామకాలు ఆ ఒక్క కుటుంబం నుంచే జరిగాయి. కాంగ్రెస్, బీజేపీలకు మధ్య ఉన్న తేడా అదే. కాంగ్రెస్లో కుటుంబమే పార్టీ, బీజేపీకి పార్టీయే కుటుంబం అని సంబిత్ పాత్రా అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







