షట్డౌన్ కు తాత్కాలిక తెర
- January 26, 2019
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంపు 35 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్డౌన్లను తాత్కాలికంగా ప్రభుత్వ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ట్రంప్ తాజాగా వెల్లడించారు. దీంతో వచ్చే నెల 15వరకు అంటే మూడు వారాల పాటు తాత్కాలికంగా ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ షట్డౌన్ అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైందిగా నిలిచింది. అక్రమ వలసలను నిర్మూలించేందుకు అమెరికామెక్సికో సరిహద్దులో భారీ గోడను నిర్మించాలని ట్రంప్ మొదటి నుంచి గట్టి పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ నిర్ణయానికి విపక్ష డెమోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ట్రంప్ పాక్షికంగా ప్రభుత్వ మూసివేతకు చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితికి తెరదించేందుకు గురువారం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను సైతం ఆ దేశ సెనేట్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అధికార రిపబ్లికన్లు తాజాగా గోడ నిర్మాణ ప్రతిపాదనతో కూడిన బిల్లును మరోసారి ప్రవేశపెట్టారు. అయితే అధికార పక్షం, విపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో తాత్కాలికంగా షట్డౌన్ ఎత్తివేశారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









