ఎయిర్ ఇండియా వారి బంపర్ ఆఫర్
- January 26, 2019
గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణ టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. అన్ని పన్నులూ కలుపుకుని ఎకానమీ క్లాస్ టికెట్ను రూ.979 కనీస ధరకు విక్రయించనున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది.
కొనుగోలు చేసిన టికెట్లపై ఈ ఏడాది సెప్టెంబరు 30 లోగా ప్రయాణాలు చేసుకోవచ్చని వివరించింది. ఎయిరిండియా వెబ్సైట్, ఎయిర్ లైన్, సిటీ బుకింగ్ కార్యాలయాలు, కాల్ సెంటర్లు, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ప్రాతిపదికన టికెట్ల కేటాయింపు జరుగుతందని తెలిపింది.
అదే బిజినెస్ క్లాస్లో అయితే టికెట్ ధర రూ.6,965 వరకు ఉంటుందని ఎయిర్ ఇండియా పేర్కొంది. అలాగే, అంతర్జాతీయ ప్రమాణాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఎకానమీ క్లాస్లో రూ.55 వేలకే అమెరికాకు వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.
యూకే, యూరప్ సెక్టార్లకు రూ.32 వేలు, ఆస్ట్రేలియాకు ఎకానమీ క్లాస్లో రూ.50 వేలకే టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ ఆసియా ప్రాంతంలోని దేశాలకు రూ.11 వేలకు టికెట్ల ధరలు ఉన్నాయని.. ప్రయాణీకులు ఈ ఆఫర్ను వినియోగించుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









