ఎయిర్ ఇండియా వారి బంపర్ ఆఫర్
- January 26, 2019
గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణ టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. అన్ని పన్నులూ కలుపుకుని ఎకానమీ క్లాస్ టికెట్ను రూ.979 కనీస ధరకు విక్రయించనున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది.
కొనుగోలు చేసిన టికెట్లపై ఈ ఏడాది సెప్టెంబరు 30 లోగా ప్రయాణాలు చేసుకోవచ్చని వివరించింది. ఎయిరిండియా వెబ్సైట్, ఎయిర్ లైన్, సిటీ బుకింగ్ కార్యాలయాలు, కాల్ సెంటర్లు, ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ప్రాతిపదికన టికెట్ల కేటాయింపు జరుగుతందని తెలిపింది.
అదే బిజినెస్ క్లాస్లో అయితే టికెట్ ధర రూ.6,965 వరకు ఉంటుందని ఎయిర్ ఇండియా పేర్కొంది. అలాగే, అంతర్జాతీయ ప్రమాణాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఎకానమీ క్లాస్లో రూ.55 వేలకే అమెరికాకు వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు.
యూకే, యూరప్ సెక్టార్లకు రూ.32 వేలు, ఆస్ట్రేలియాకు ఎకానమీ క్లాస్లో రూ.50 వేలకే టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తూర్పు, దక్షిణ ఆసియా ప్రాంతంలోని దేశాలకు రూ.11 వేలకు టికెట్ల ధరలు ఉన్నాయని.. ప్రయాణీకులు ఈ ఆఫర్ను వినియోగించుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









