యాత్ర మొదటి టికెట్ వేలం. కళ్లు చెదిరే రేటు.
- February 04, 2019
వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యే ప్రీ రిలీజ్ వేడుకను కూడా సినిమా జరుపుకుంది. యాత్ర సినిమాకు సంబంధించిన మొదటి టికెట్ను అమెరికాలోని సీటెల్లో వేలం వేశారు.
భారీ ధరకు మొదటి టికెట్ అమ్ముడుపోయింది. పలువురు అభిమానులు మొదటి టికెట్ను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. మునీశ్వర్ అనే ఎన్ఆర్ఐ మొదటి టికెట్ను 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నారు. మన కరెన్సీలో 4. 37లక్షలకు టికెట్ అమ్ముడుపోయింది.
టికెట్ అసలు ధర 12 డాలర్లు. మిగిలిన సొమ్మును వైఎస్ఆర్ ఫౌండేషన్ను విరాళంగా ఇస్తున్నట్టు వేలం నిర్వాహకులు తెలిపారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!