యాత్ర మొదటి టికెట్ వేలం. కళ్లు చెదిరే రేటు.
- February 04, 2019
వైఎస్ఆర్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్యే ప్రీ రిలీజ్ వేడుకను కూడా సినిమా జరుపుకుంది. యాత్ర సినిమాకు సంబంధించిన మొదటి టికెట్ను అమెరికాలోని సీటెల్లో వేలం వేశారు.
భారీ ధరకు మొదటి టికెట్ అమ్ముడుపోయింది. పలువురు అభిమానులు మొదటి టికెట్ను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. మునీశ్వర్ అనే ఎన్ఆర్ఐ మొదటి టికెట్ను 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నారు. మన కరెన్సీలో 4. 37లక్షలకు టికెట్ అమ్ముడుపోయింది.
టికెట్ అసలు ధర 12 డాలర్లు. మిగిలిన సొమ్మును వైఎస్ఆర్ ఫౌండేషన్ను విరాళంగా ఇస్తున్నట్టు వేలం నిర్వాహకులు తెలిపారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







