హీరో తారకరత్న రెస్టారెంట్ కూల్చివేత.. బంజారాహిల్స్లో ఉద్రిక్తత
- February 04, 2019
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సినీ హీరో తారకరత్నకు సంబంధించిన డ్రైవ్ఇన్ రెస్టారెంట్ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేందుకు ప్రయత్నించారు. అయితే ఎందుకు కూలుస్తున్నారంటూ జీహెచ్ఎంసీ అధికారులతో రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని తమకు ఫిర్యాదు రావడంతో కూల్చడానికి వచ్చామని అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తమకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరారు. తారకరత్న విన్నపం మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మూడు గంటల గడువు ఇచ్చారు. గడువులోగా రెస్టారెంట్లోని సామగ్రిని అక్కడి నుంచి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
డ్రైవ్ఇన్ రెస్టారెంట్ను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో నడుపుతున్నారని, రాత్రి వేళల్లో మద్యం తాగుతూ, డీజే సౌండ్స్తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వారి ఫిర్యాదుతోనే రెస్టారెంట్ను కూల్చడానికి జీహెచ్ఎంసీ అధికారులు వచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







