హెచ్చరిక: అత్యధిక నేరాలు ఆన్లైన్లోనే
- February 19, 2019దుబాయ్లో 95 శాతం వరకు నేరాలు ఆన్లైన్లోనే జరుగుతాయని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు హెచ్చరిస్తున్నారు. దుబాయ్ పోలీస్ - ఫ్యూచర్ ఫోర్సైట్ సెంటర్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా అబ్దుల్ రహ్మాన్ బిన్ సుల్తాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆన్లైన్ గేమింగ్ ప్రమాదాలపైనా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆన్లైన్ గేమింగ్స్ పిల్లల భవిష్యత్తుపై పెను ప్రమాదం చూపుతాయని హెచ్చరించారాయన. రానున్న 10 ఏళ్ళలో సెక్యూరిటీ ఛాలెంజెస్ అనే అంశంపై జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బ్రిగేడియర్ అబ్దుల్లా అబ్దుల్ రహ్మాన్ బిన్ సుల్తాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ఆన్లైన్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చుననీ, ప్రైవసీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కాగా, సెక్యూరిటీ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బట్టి అల్ ఫలాసి, ఎమిరేట్ సెక్యూరిటీ - ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దుబాయ్ పోలీస్కి సంబంధించిన అన్ని ఇ-సిస్టమ్స్నీ లింక్ చేయవచ్చు. తద్వారా కొత్త సవాళ్ళపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్