హెచ్చరిక: అత్యధిక నేరాలు ఆన్లైన్లోనే
- February 19, 2019
దుబాయ్లో 95 శాతం వరకు నేరాలు ఆన్లైన్లోనే జరుగుతాయని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు హెచ్చరిస్తున్నారు. దుబాయ్ పోలీస్ - ఫ్యూచర్ ఫోర్సైట్ సెంటర్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా అబ్దుల్ రహ్మాన్ బిన్ సుల్తాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆన్లైన్ గేమింగ్ ప్రమాదాలపైనా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆన్లైన్ గేమింగ్స్ పిల్లల భవిష్యత్తుపై పెను ప్రమాదం చూపుతాయని హెచ్చరించారాయన. రానున్న 10 ఏళ్ళలో సెక్యూరిటీ ఛాలెంజెస్ అనే అంశంపై జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బ్రిగేడియర్ అబ్దుల్లా అబ్దుల్ రహ్మాన్ బిన్ సుల్తాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ఆన్లైన్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చుననీ, ప్రైవసీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. కాగా, సెక్యూరిటీ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బట్టి అల్ ఫలాసి, ఎమిరేట్ సెక్యూరిటీ - ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దుబాయ్ పోలీస్కి సంబంధించిన అన్ని ఇ-సిస్టమ్స్నీ లింక్ చేయవచ్చు. తద్వారా కొత్త సవాళ్ళపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









