పుల్వామా ఎటాక్: అమెరికా లో భారతీయుల నిరసన
- February 23, 2019
పుల్వామా ఎటాక్ తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతీ భారతీయుడు పాకిస్తాన్ పై ఆగ్రహంతో రగిలలిపోతున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు కూడా పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టెర్రర్ ఎటాక్ లో పాకిస్తాన్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ అమెరికాలోని న్యూయార్క్ లో పాకిస్తాన్ విదేశీ కార్యాలయాల వద్ద ప్రవాస భారతీయులు నిరసన వ్యక్తం చేశారు. 600 మందికి పైగా ప్రవాస భారతీయులు ఆందోళనలో పాల్గొన్నారు.
భారతీయ జెండాలను పట్టుకుని 'భారత్ మాతాకి జై' నినాదాలతో ప్రవాస భారతీయులు పాకిస్తాన్ విదేశీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అలాగే పాకిస్తాన్ ముర్దాబాద్, గ్లోబల్ టెర్రర్ పాకిస్తాన్, ఎల్ఈటీ పాకిస్తాన్, "9/11 పాకిస్తాన్," "26/11 పాకిస్తాన్, ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ అంటూ ప్లకార్డులపై రాసి ప్రదర్శించారు. "పాకిస్తాన్: ఏ టెర్రర్ నేషన్" అనే నినాదాన్ని వారు అమెరికాలోని పాకిస్తాన్ కన్సలేట్ ముందు గట్టిగా వినిపించారు.
ఈ కార్యక్రమం మొత్తం 600 మందితో ఫిబ్రవరి 22వ తేదీన జరగగా, అమెరికాలోని బీజేపీ సానుభూతి పరులు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. భారత మూలాలు కలిగిన ఉత్తర అమెరికన్లు కూడా ఆందోళనతో పాల్గొని పాకిస్తాన్ పై తమ గళం వినిపించారు. మెజారిటీ అసోషియన్లు.. బీహార్, జార్కండ్ అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(BAJANA), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్(TANA), ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







