పుల్వామా ఎటాక్: అమెరికా లో భారతీయుల నిరసన
- February 23, 2019
పుల్వామా ఎటాక్ తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతీ భారతీయుడు పాకిస్తాన్ పై ఆగ్రహంతో రగిలలిపోతున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు కూడా పాకిస్తాన్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టెర్రర్ ఎటాక్ లో పాకిస్తాన్ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ అమెరికాలోని న్యూయార్క్ లో పాకిస్తాన్ విదేశీ కార్యాలయాల వద్ద ప్రవాస భారతీయులు నిరసన వ్యక్తం చేశారు. 600 మందికి పైగా ప్రవాస భారతీయులు ఆందోళనలో పాల్గొన్నారు.
భారతీయ జెండాలను పట్టుకుని 'భారత్ మాతాకి జై' నినాదాలతో ప్రవాస భారతీయులు పాకిస్తాన్ విదేశీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అలాగే పాకిస్తాన్ ముర్దాబాద్, గ్లోబల్ టెర్రర్ పాకిస్తాన్, ఎల్ఈటీ పాకిస్తాన్, "9/11 పాకిస్తాన్," "26/11 పాకిస్తాన్, ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ అంటూ ప్లకార్డులపై రాసి ప్రదర్శించారు. "పాకిస్తాన్: ఏ టెర్రర్ నేషన్" అనే నినాదాన్ని వారు అమెరికాలోని పాకిస్తాన్ కన్సలేట్ ముందు గట్టిగా వినిపించారు.
ఈ కార్యక్రమం మొత్తం 600 మందితో ఫిబ్రవరి 22వ తేదీన జరగగా, అమెరికాలోని బీజేపీ సానుభూతి పరులు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. భారత మూలాలు కలిగిన ఉత్తర అమెరికన్లు కూడా ఆందోళనతో పాల్గొని పాకిస్తాన్ పై తమ గళం వినిపించారు. మెజారిటీ అసోషియన్లు.. బీహార్, జార్కండ్ అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(BAJANA), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్(TANA), ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







