కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన 'సెబీ'
- March 01, 2019
భారత స్టాక్ మార్కెట్ను మరింత బలోపేతం చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా బ్రోకర్లు, స్టాక్ ఎక్స్ఛేంజ్లు, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు వేచి చూస్తున్న కంపెనీల నుంచి వసూలు చేస్తున్న ఫీజులను తగ్గించేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా అంకురాలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు కొత్త నియమాలను తీసుకువచ్చింది. ఈ కొత్త నియమాల వల్ల అంకురాలల్లో పెట్టబడిదారులు మదుపు చేసేందుకు దోహదపడుతుందని, అది అంకురాల నిధుల సమీకరణకు ఉపయోగపడుతుందని 'సెబీ' అభిప్రాయపడింది.
కొన్ని వరస సమావేశాల అనంతరం కార్పొరేట్లు ఎదుర్కొంటున్న రుణ పునరుద్ధరణ సమస్యలపై కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. రుణ పునరుద్ధరణకు ప్రత్యేక కేసులుగా భావిస్తున్న కొన్ని కంపెనీలకు మినహాయింపు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు స్టాక్ మార్కెట్లల్లో లిస్ట్(నమోదు) అయ్యేందుకు నియమాలను సరళీకృతం చేసినట్టు వెల్లడించింది. అంతేకాకుండా కమొడిటీ డెరివేటీవ్స్లో ట్రేడ్ చేయటానికి మ్యూచువల్ ఫండ్లు, ఫోర్ట్పోలియో ఇన్వెస్టర్లను అనుమతిస్తున్నట్లు వివరించింది. సెబీ తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభినందనలు తెలిపారని సెబీ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా నేషనల్ హెల్త్ సర్వే ప్రారంభం..!!
- యుద్ధాన్ని పూర్తిగా ముగించడంపైనే ఫోకస్.. ఖతార్
- ప్రభుత్వ పాఠశాలల కోసం ఐబీ (IB) ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- అల్-అహ్మదిలో 128 నోటీసులు జారీ.. కఠిన చర్యలు..!!
- ప్రాంతీయ పరిణామాలపై ఒమన్,ఖతార్ చర్చలు..!!
- Dh25,000 చొప్పున బహుమతి గెలిచిన నలుగురు భారతీయ ప్రవాసులు..!!
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!









