కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన 'సెబీ'
- March 01, 2019
భారత స్టాక్ మార్కెట్ను మరింత బలోపేతం చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా బ్రోకర్లు, స్టాక్ ఎక్స్ఛేంజ్లు, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు వేచి చూస్తున్న కంపెనీల నుంచి వసూలు చేస్తున్న ఫీజులను తగ్గించేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా అంకురాలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు కొత్త నియమాలను తీసుకువచ్చింది. ఈ కొత్త నియమాల వల్ల అంకురాలల్లో పెట్టబడిదారులు మదుపు చేసేందుకు దోహదపడుతుందని, అది అంకురాల నిధుల సమీకరణకు ఉపయోగపడుతుందని 'సెబీ' అభిప్రాయపడింది.
కొన్ని వరస సమావేశాల అనంతరం కార్పొరేట్లు ఎదుర్కొంటున్న రుణ పునరుద్ధరణ సమస్యలపై కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. రుణ పునరుద్ధరణకు ప్రత్యేక కేసులుగా భావిస్తున్న కొన్ని కంపెనీలకు మినహాయింపు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు స్టాక్ మార్కెట్లల్లో లిస్ట్(నమోదు) అయ్యేందుకు నియమాలను సరళీకృతం చేసినట్టు వెల్లడించింది. అంతేకాకుండా కమొడిటీ డెరివేటీవ్స్లో ట్రేడ్ చేయటానికి మ్యూచువల్ ఫండ్లు, ఫోర్ట్పోలియో ఇన్వెస్టర్లను అనుమతిస్తున్నట్లు వివరించింది. సెబీ తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభినందనలు తెలిపారని సెబీ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







