కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన 'సెబీ'
- March 01, 2019
భారత స్టాక్ మార్కెట్ను మరింత బలోపేతం చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా బ్రోకర్లు, స్టాక్ ఎక్స్ఛేంజ్లు, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు వేచి చూస్తున్న కంపెనీల నుంచి వసూలు చేస్తున్న ఫీజులను తగ్గించేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా అంకురాలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యేందుకు కొత్త నియమాలను తీసుకువచ్చింది. ఈ కొత్త నియమాల వల్ల అంకురాలల్లో పెట్టబడిదారులు మదుపు చేసేందుకు దోహదపడుతుందని, అది అంకురాల నిధుల సమీకరణకు ఉపయోగపడుతుందని 'సెబీ' అభిప్రాయపడింది.
కొన్ని వరస సమావేశాల అనంతరం కార్పొరేట్లు ఎదుర్కొంటున్న రుణ పునరుద్ధరణ సమస్యలపై కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. రుణ పునరుద్ధరణకు ప్రత్యేక కేసులుగా భావిస్తున్న కొన్ని కంపెనీలకు మినహాయింపు ప్రకటిస్తున్నట్లు తెలిపింది. రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు స్టాక్ మార్కెట్లల్లో లిస్ట్(నమోదు) అయ్యేందుకు నియమాలను సరళీకృతం చేసినట్టు వెల్లడించింది. అంతేకాకుండా కమొడిటీ డెరివేటీవ్స్లో ట్రేడ్ చేయటానికి మ్యూచువల్ ఫండ్లు, ఫోర్ట్పోలియో ఇన్వెస్టర్లను అనుమతిస్తున్నట్లు వివరించింది. సెబీ తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభినందనలు తెలిపారని సెబీ తెలిపింది.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









