అతని గురించి సమాచారం ఇస్తే..మిలియన్ డాలర్ల బహుమతి
- March 01, 2019
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ అధినేత బిన్ లాడెన్ కుమారుడి ఆచూకి అందించిన వారికి బహుమతి ఇస్తామంటూ అమెరికా ప్రకటించింది. బిన్ లాడెన్ కొడుకు హమ్జాబిన్ లాడెన్ గురించి సమాచారం అందిస్తే ఒక మిలియన్ డాలర్లను ఇస్తామంటూ వెల్లడించింది. అయితే అతడు పాకిస్థాన్, అఫ్గనిస్తాన్, ఇరాన్, సిరియా దేశాల్లో ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. బిన్ లాడెన్ ను అమెరికా దళాలు హతమార్చిన తర్వాత అల్ ఖైదాకు హమ్జాబిన్ నాయకత్వం వహిస్తున్నాడు. సిరియా అంతర్యుద్ధం పాలస్తీనా స్వేచ్ఛకు దారితీస్తుందని, జిహాదీలు ఐక్యంగా ఉండాలంటూ హమ్జా 2015లో ఓ వీడియో విడుదల చేశాడు. తండ్రిని చంపినందుకు అతడు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండటంతో ….అతన్ని పట్టుకునేందుకు భారీ నగదును బహుమతిని ప్రకటించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







