లండన్‌:భారతీయులపై దుండగుల గ్రూప్‌ దాడి

- March 10, 2019 , by Maagulf
లండన్‌:భారతీయులపై దుండగుల గ్రూప్‌ దాడి

లండన్‌:నగరంలోని భారతీయ హైకమిషన్‌ కార్యాలయం ముందు వీసా సంబంధిత పనులకోసం వచ్చిన బ్రిటిష్‌ భారతీయులపై శనివారం కొందరు దుండగులు దాడి చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ గ్రూప్‌కు చెందినట్లుగా భావిస్తున్న ఈ దుండగుల గుంపు 'నారా తక్బీర్‌, అల్లాహో అక్బర్‌ వంటి నినాదాలతో పాటు భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ హైకమిషన్‌ వద్ద వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం ఎదురు చూస్తున్న వారిపై దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు ఆదివారం మీడియాకు చెప్పారు. చేతుల్లో ఖలిస్తాన్‌ జెండాలను ధరించిన దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు వారు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com