కమ్ముకున్న యుద్దమేఘాలు..
- May 12, 2019ఇరాన్ మీద అమెరికా ఆంక్షలతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలు, బలగాలపై ఇరాన్ దాడికి దిగవచ్చన్న నిఘావర్గాల నేపధ్యంలో అమెరికా యుద్దనౌకతో సన్నద్దమైనట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. దీనిలో భాగంగా విమాన వాహక యుద్దనౌక యూఎస్ ఎస్ ఆర్టింగ్టన్ తోపాటు యూఎస్ ఎస్ అబ్రహాం లింకన్ నౌకను సముద్ర జలాల్లో మోహరించింది. పేట్రియాట్ గగనతల క్షిపణీ రక్షణ వ్యవస్థను సైతం ఈ ప్రాంతానికి తరలించింది. ఇరాన్ తో తాము యుద్దాన్ని కోరుకోవడంలేదని, తమ బలగాలను, ప్రయోజనాలను కాపాడుకునేందుకే సిద్దమైనట్లు అమెరికా రక్షణ శాఖ స్పష్టంచేసింది. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తాము అమెరికాతో యుద్దాన్ని కోరుకోవడంలేదని, కానీ తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్థిస్తోందని తెలిపింది.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు