కమ్ముకున్న యుద్దమేఘాలు..
- May 12, 2019
ఇరాన్ మీద అమెరికా ఆంక్షలతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలు, బలగాలపై ఇరాన్ దాడికి దిగవచ్చన్న నిఘావర్గాల నేపధ్యంలో అమెరికా యుద్దనౌకతో సన్నద్దమైనట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. దీనిలో భాగంగా విమాన వాహక యుద్దనౌక యూఎస్ ఎస్ ఆర్టింగ్టన్ తోపాటు యూఎస్ ఎస్ అబ్రహాం లింకన్ నౌకను సముద్ర జలాల్లో మోహరించింది. పేట్రియాట్ గగనతల క్షిపణీ రక్షణ వ్యవస్థను సైతం ఈ ప్రాంతానికి తరలించింది. ఇరాన్ తో తాము యుద్దాన్ని కోరుకోవడంలేదని, తమ బలగాలను, ప్రయోజనాలను కాపాడుకునేందుకే సిద్దమైనట్లు అమెరికా రక్షణ శాఖ స్పష్టంచేసింది. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తాము అమెరికాతో యుద్దాన్ని కోరుకోవడంలేదని, కానీ తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్థిస్తోందని తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









