కమ్ముకున్న యుద్దమేఘాలు..
- May 12, 2019
ఇరాన్ మీద అమెరికా ఆంక్షలతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలు, బలగాలపై ఇరాన్ దాడికి దిగవచ్చన్న నిఘావర్గాల నేపధ్యంలో అమెరికా యుద్దనౌకతో సన్నద్దమైనట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. దీనిలో భాగంగా విమాన వాహక యుద్దనౌక యూఎస్ ఎస్ ఆర్టింగ్టన్ తోపాటు యూఎస్ ఎస్ అబ్రహాం లింకన్ నౌకను సముద్ర జలాల్లో మోహరించింది. పేట్రియాట్ గగనతల క్షిపణీ రక్షణ వ్యవస్థను సైతం ఈ ప్రాంతానికి తరలించింది. ఇరాన్ తో తాము యుద్దాన్ని కోరుకోవడంలేదని, తమ బలగాలను, ప్రయోజనాలను కాపాడుకునేందుకే సిద్దమైనట్లు అమెరికా రక్షణ శాఖ స్పష్టంచేసింది. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తాము అమెరికాతో యుద్దాన్ని కోరుకోవడంలేదని, కానీ తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్థిస్తోందని తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







