కాబూల్:24 మంది తాలిబన్ ఉగ్రవాదుల హతం..
- May 12, 2019
కాబూల్: అఫ్గానిస్థాన్ భద్రతా బలగాలు తమ దేశంలోని హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. అఫ్గాన్ మిలిటరీ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... 20 మంది తాలిబన్లను పక్తీకా ప్రావిన్సులోని జుర్మాత్, బెర్మాల్ జిల్లాల్లో హతమార్చారు. గజనీ ప్రావిన్సులోని అందర్ జిల్లాలో ఇద్దరు, హేరాత్ ప్రావిన్సులోని ఫర్సీ జిల్లాలో మరో ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. అఫ్గాన్ వ్యాప్తంగా తాలిబన్లు ఉగ్రవాద చర్యలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలపై తాలిబన్లు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
తాలిబన్లు, ఐఎస్ ఉగ్రవాదుల చర్యల కారణంగా అఫ్గానిస్థాన్.. రాజకీయ అస్థిరత, సామాజిక, భద్రత సమస్యలను ఎదుర్కొంటోంది. దేశంలోని ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఇతర దేశాల భద్రతా బలగాల సాయంతో ఆఫ్గాన్ బలగాలు ఉగ్ర వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సులతో పాటు హెల్మాంద్, ఉరుజ్గాన్, జాబూల్, నంగర్హర్ ప్రావిన్సుల్లోనూ భద్రతా బలగాలు ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు జరుపుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









