హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ వికటించి ఇండియన్ మహిళ మృతి
- May 13, 2019
దుబాయ్లోని 'బెట్టీస్ కేక్ టేల్స్'లో చెఫ్గా పనిచేస్తున్న బెట్టీ రీటా ఫెర్నాండెజ్ అనే భారతీయ మహిళ ఇటీవల హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోగా, కొద్ది రోజులకే కాంప్లికేషన్స్ తలెత్తి, ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బెట్టీకి ఇద్దరు పిల్లలున్నారు. అల్ జహ్రా హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మొహాయెమ్ అబ్దెల్ఘనీ మాట్లాడుతూ, సర్జరీ తర్వాతి పరిస్థితులపై ఆమెకీ, ఆమె కుటుంబ సభ్యులకీ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందనీ, అల్ జహ్రా హాస్పిటల్ దుబాయ్లో ఆమెకు సర్జరీ నిర్వహించామని చెప్పారు. హాస్పిటల్ అలాగే దుబాయ్ హెల్త్ అథారిటీ మరియు జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్తో కలిసి రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో వుందని దుబాయ్ హెల్త్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. గత వారం 24 ఏళ్ళ ఎమిరేటీ మహిళ, నోస్ సర్జరీ తర్వాత కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ డేమేజ్తో 20 రోజులుగా కోమాలోకి వెళ్ళిపోయింది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?







