హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ వికటించి ఇండియన్ మహిళ మృతి
- May 13, 2019
దుబాయ్లోని 'బెట్టీస్ కేక్ టేల్స్'లో చెఫ్గా పనిచేస్తున్న బెట్టీ రీటా ఫెర్నాండెజ్ అనే భారతీయ మహిళ ఇటీవల హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోగా, కొద్ది రోజులకే కాంప్లికేషన్స్ తలెత్తి, ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. బెట్టీకి ఇద్దరు పిల్లలున్నారు. అల్ జహ్రా హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మొహాయెమ్ అబ్దెల్ఘనీ మాట్లాడుతూ, సర్జరీ తర్వాతి పరిస్థితులపై ఆమెకీ, ఆమె కుటుంబ సభ్యులకీ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందనీ, అల్ జహ్రా హాస్పిటల్ దుబాయ్లో ఆమెకు సర్జరీ నిర్వహించామని చెప్పారు. హాస్పిటల్ అలాగే దుబాయ్ హెల్త్ అథారిటీ మరియు జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్తో కలిసి రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో వుందని దుబాయ్ హెల్త్ అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. గత వారం 24 ఏళ్ళ ఎమిరేటీ మహిళ, నోస్ సర్జరీ తర్వాత కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ డేమేజ్తో 20 రోజులుగా కోమాలోకి వెళ్ళిపోయింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







