సంచలనం.. పుల్వామా ఉగ్రదాడి వెనుక మన జవాన్..
- May 18, 2019పాకిస్థాన్కు చెందిన యువతి పన్నిన వలలో చిక్కిన ఒక భారత జవాను, సైనిక రహస్యాలను ఆమెకు, తద్వారా పాక్ ఉగ్రవాదులకు అందించాడు. ఆ సమాచారంతోనే ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి, 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు.మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేకదళం, కేంద్ర నిఘా సంస్థలు చేసిన దర్యాప్తులో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలో బీహర్ రెజిమెంటలో నాయక్ క్లర్కుగా అవినాశ్ కుమార్ అనే యువకుడు పని చేసేవాడు. 2018లో అతడిని అసోంకు బదిలీ చేశారు. ఆ సమయంలో అతడికి వాట్సాప్ లో ఓ పాకిస్థాన్ యువతితో పరిచయం ఏర్పడింది. తన అందచందాలతో అవినాశ్ను వలలో వేసుకున్న ఆ యువతి.. సైనిక రహస్యాలను అతడి వద్ద కూపీ లాగి ఉగ్రవాదులకు చేరవేసేది.
అవినాశ్ ఇచ్చిన సమాచారంతో పక్కా ప్రణాళిక రచించుకున్న ముష్కరులు.. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అవినాశ్ బ్యాంక్ ఖాతాలో పాకిస్థాన్ నుంచి 50వేల రూపాయల నగదు కూడా జమ అయ్యిందని దర్యాప్తులో తేలింది. భోపాల్లోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్కు తరలించారు. అవినాశ్ తండ్రి కూడా జవానే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!