డార్లింగ్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్
- January 16, 2020తెలుగు వారి పెద్ద పండుగ జనవరి 16 కనుమతో ముగుస్తుంది. కానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఈ సంక్రాంతిని మరో రోజు పొడిగించాడు. అవును, అసలు మేటర్ ఏంటంటే.. ప్రభాస్ 'సాహో' తర్వాత 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ లవ్ స్టోరిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
ఇప్పటికే విదేశాల్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాకు 'జాన్' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా.. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి మూవీ టీమ్ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తితో ఉన్నారు.
చాలా కాలంగా ప్రభాస్ ఫ్యాన్స్ 'జాన్' మూవీపై అప్డేట్ ఇవ్వాలంటూ డార్లింగ్ను కోరుతున్నారు. సంక్రాంతి పండుగను పొడిగిస్తూ ప్రభాస్ రేపు (జనవరి 17) తన లేటెస్ట్ మూవీ గురించి ఒక అప్డేట్ ఇవ్వనున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రేపు డార్లింగ్ 20వ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వబోతున్నాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ