తెలంగాణ:లాటరీ నెపంతో ఘరానా మోసం..
- January 16, 2020తెలంగాణ:సైబర్ క్రైమ్స్పై అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొచ్చి అవగాహన కల్పించినా.. డబ్బుపై ఆశతో నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు జనాలు. తాజాగా.. మరో ఘటన నిజమాబాద్లో చేటుచేసుకుంది. ఆర్మూర్ మండలం చెపుర్ గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి వృత్తిలో భాగంగా కువైట్లో ఉంటున్నాడు. లాటరీలో 46 లక్షలు వచ్చాయని, అతనికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మాకు రూ. 15 లక్షలు ఇస్తే.. మీకు రూ. 46 లక్షలు ఇస్తామని నేరగాళ్లు మభ్య పెట్టారు. డబ్బుమీద ఆశతో అతను నేరగాళ్ల ట్రాప్లో పడ్డాడు. దీంతో.. తన వద్ద ఉన్న రూ.4 లక్షలతో పాటు, భార్య వద్ద ఉన్న 11 లక్షలు నేరగాళ్ల అకౌంట్లో వేశాడు. డబ్బు ఇంకా రాకపోవడంతో అతను ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాడు. ఆ నెంబర్ కలవకపోవడంతో.. పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అనంతరం లాటరీ కాల్ ఫేక్ అని తెసుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు అశోక్, ముత్తెమ్మ దంపతులు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్