ఇంట్లో చలిమంటలు వద్దు..ప్రజలకు అబుదాబి పోలీస్ హెచ్చరిక
- January 16, 2020యూ.ఏ.ఈ:ఇళ్లలో ఎవరూ బొగ్గు, కట్టెలు కాల్చొద్దని అబుదాబి పోలీసులు హెచ్చరించారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో టెంపరేచర్ 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలితీవ్రత అమాంతంగా పెరిగింది. కొన్ని డివిజన్లలో టెంపరేచర్ మైనస్ లోకి వెళ్లిపోయాయి. రస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్ పర్వత ప్రాంతంలో మంచు కూడా కురుస్తున్నట్లు వెదర్ రిపోర్ట్ చెబుతోంది. చలితీవ్రతను తట్టుకునేందుకు ప్రజలు ఇంట్లోనే చలిమంటలు వేసుకునే అవకాశాలు ఉండటంతో అబుదాబి పోలీసులు ముందస్తు హెచ్చరికలు సూచించారు. వెచ్చదనం కోసం ఎవరూ ఇంట్లో బొగ్గు, చెక్కలను కాల్చొద్దని వాటి నుంచి వెలువడే డేంజరస్ గ్యాస్ తో ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. క్లోజ్డ్ ప్లేసెస్లో బొగ్గు, చెక్కలతో మంటపెడితే ప్రమాదకరమైన బెంజ్, కార్బన్ మోనాక్సైడ్, పాలిసైక్లిక్ హైడ్రోకార్బన్స్ వంటి విషవాయువులు వెలువడుతాయి. వీటి ద్వారా లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. బొగ్గు నుంచి వచ్చే పొగతో ఒక్కొసారి నిద్రలోనే ప్రాణాలు కొల్పోయే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు