కరోనా నుంచి కోలుకుంటున్న ఇరాన్...
- April 11, 2020
కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్నది. అగ్రదేశాల్లో సైతం ఈ వైరస్ వణుకుపుట్టిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద 16,99,631 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,02,734 మంది మరణించారు. మరణాల సంఖ్యలో అమెరికా, ఇటలీ దేశాలు పోటీ పడుతున్నాయి. అయితే,గత కొన్ని రోజులుగా ఇటలీలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఐసీయూ వార్డులపై కొంతమేరకు ఒత్తిడి తగ్గింది.
కానీ, అమెరికాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ప్రతి రోజు మరణాల సంఖ్య రెండు వేలు ఉండటం ఆ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. న్యూయార్క్ నగరంలోనే ఈ సంఖ్య అత్యధికంగా ఉండటం విశేషం. అయితే,మిడిల్ ఈస్ట్ దేశాల్లో చూసుకుంటే ఇరాన్ లో పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. ఇరాన్ లో 65వేలమంది పైగా కరోనా బారిన పడగా, 4,232 మంది మరణించారు. అయితే, ఇరాన్ లో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. కరోనా బాధితుల్లో సంగానికంటే ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకున్నారు. 28 వేల కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీరు కూడా త్వరలోనే కోరుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నది ఇరాన్.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







