ఇల్లీగల్ కార్ లిఫ్ట్ జరీమానాలపై డిస్కౌంట్ జూన్ 30 వరకు
- May 29, 2020
షార్జా:ఇల్లీగల్ ఆపరేషన్ ఆఫ్ వెహికిల్స్ - కార్ లిఫ్ట్స్కి సంబంధించి జరీమానాల్లో 50 శాతం డిస్కౌంట్ జూన్ 30 వరకు షార్జాలో వినియోగించుకోవచ్చునని షార్జా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎస్ఆర్టిఎ) పేర్కొంది. ఎస్ఆర్టిఎ ట్రాన్స్పోర్టేషన్ ఎఫైర్స్ డైరెక్టర్ అబ్దుల్అజీజ్ అల్ జర్వాన్ మాట్లాడుతూ, ఉల్లంఘనలకు పాల్పడినవారు, ఈ డిస్కౌంట్ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ సుల్తాన్ ముహమ్మద్ అల్ కాసిమి డైరెక్టివ్స్ నేపథ్యంలో షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ డెసిషన్ని అమలు చేస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 31 నుంచి జూన్ 30 వరకు ఈ డిస్కౌంట్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ఉల్లంఘనలకు సంబంధించి 5,000 దిర్హామ్లు జరీమానా విధిస్తున్నారు. ఉల్లంఘన రిపీట్ అయితే 10,000 జరీమానా విధిస్తున్నారు. కాగా, జరీమానాల్ని వెబ్సైట్ ద్వారా చెల్లించవచ్చు. ఇదిలా వుంటే, అల్ నౌమి, జరీమానాల డిస్కౌంట్ని వాహనదారులు వినియోగించుకోవడమే కాకుండా, రూల్స్ని పాటించాలని సూచించారు. ఎస్ఆర్టిఎ కాల్ సెంటర్ (600525252)కి సామాన్యులు ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చునని అధికార యంత్రాంగం చెబుతోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









