కోవిడ్-19 ఎఫెక్ట్.. బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు
- June 17, 2020
ముంబై:ఇంకో అయిదేళ్ల కన్నా ప్రజలు డిజిటల్ టెక్నాలజీతో మమేకం కాక తప్పని పరిస్థితి. కానీ అనుకోకుండా మన జీవితాల్లోకి మన ప్రమేయం లేకుండా చొరబడిన కరోనా వైరస్ ఆ మార్పులేవో ఇప్పుడే చేయడానికి మార్గం సుగమం చేసింది. వైరస్ చాలా వేగంగా డిజిటల్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. దీంతో బ్యాంకింగ్ రంగంలో శాఖల విస్తరణకు బ్రేకులు పడ్డాయి. సరికొత్త రూపు రేఖలతో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కారణంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఎక్కువ మంది బ్యాంకుకు రాకుండానే డిజిటల్ పద్దతిలో లావాదేవీలు సాగిస్తున్నారు. ఇక కాంటాక్ట్ లెస్ బ్యాంకింగ్ దిశగా అడుగులు ప్రారంభం అయ్యాయని ఓ బ్యాంక్ అధికారి అంటున్నారు.
బ్యాంకులు ఇప్పటికే ఇంటరాక్టివ్ టెల్లర్ మెషీన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ తో పాటు అవసరమైతే బ్యాంకర్లతో లైవ్ చాట్ కు వీలు కల్పించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకవేళ కొత్త శాఖలు ఏర్పాటు చేస్తే మ్యాన్ పవర్ తక్కువగా, సాంకేతికత ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయని ఎస్బీఐ ఉన్నతాధికారి అంటున్నారు. అయితే గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల వినియోగదార్లకు శాఖల అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వినియోగదారులతో సంబంధాలు, శాఖల అవసరం ఉంటుందని అధికారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







