కోవిడ్-19 ఎఫెక్ట్.. బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు
- June 17, 2020
ముంబై:ఇంకో అయిదేళ్ల కన్నా ప్రజలు డిజిటల్ టెక్నాలజీతో మమేకం కాక తప్పని పరిస్థితి. కానీ అనుకోకుండా మన జీవితాల్లోకి మన ప్రమేయం లేకుండా చొరబడిన కరోనా వైరస్ ఆ మార్పులేవో ఇప్పుడే చేయడానికి మార్గం సుగమం చేసింది. వైరస్ చాలా వేగంగా డిజిటల్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. దీంతో బ్యాంకింగ్ రంగంలో శాఖల విస్తరణకు బ్రేకులు పడ్డాయి. సరికొత్త రూపు రేఖలతో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా కారణంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఎక్కువ మంది బ్యాంకుకు రాకుండానే డిజిటల్ పద్దతిలో లావాదేవీలు సాగిస్తున్నారు. ఇక కాంటాక్ట్ లెస్ బ్యాంకింగ్ దిశగా అడుగులు ప్రారంభం అయ్యాయని ఓ బ్యాంక్ అధికారి అంటున్నారు.
బ్యాంకులు ఇప్పటికే ఇంటరాక్టివ్ టెల్లర్ మెషీన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ తో పాటు అవసరమైతే బ్యాంకర్లతో లైవ్ చాట్ కు వీలు కల్పించే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకవేళ కొత్త శాఖలు ఏర్పాటు చేస్తే మ్యాన్ పవర్ తక్కువగా, సాంకేతికత ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో మరిన్ని మార్పులు చోటు చేసుకుంటాయని ఎస్బీఐ ఉన్నతాధికారి అంటున్నారు. అయితే గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల వినియోగదార్లకు శాఖల అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వినియోగదారులతో సంబంధాలు, శాఖల అవసరం ఉంటుందని అధికారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







