కోవిడ్ 19: వృద్ధులు, పిల్లలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన దుబాయ్
- June 18, 2020
దుబాయ్:లాక్ డౌన్ సాధారణ జనజీవనం దిశగా ఆంక్షలను సడలిస్తున్న దుబాయ్ సుప్రీమ్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలపై ఉన్న లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా నేపథ్యంలో 60 ఏళ్లకుపై బడిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలు పబ్లిక్ ప్రాంతాల్లో తిరగొద్దని జూన్ 18 నుంచి ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే..దుబాయ్ సుప్రీం కమిటీ తాజా నిర్ణయంతో ఇక నుంచి వృద్ధులు, పిల్లలు కూడా షాపింగ్ మాల్స్ లోకి వెళ్లవచ్చు. కానీ, ఫేస్ మాస్కులు ధరించి..ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందేనని సూచించారు. కనీసం రెండు మీటర్ల వ్యత్యాసం ఉండేలా భౌతిక దూరం అనుసరించాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే.. బుధవారం నాటికి 42,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా..293 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







