కోవిడ్ 19: వృద్ధులు, పిల్లలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన దుబాయ్
- June 18, 2020
దుబాయ్:లాక్ డౌన్ సాధారణ జనజీవనం దిశగా ఆంక్షలను సడలిస్తున్న దుబాయ్ సుప్రీమ్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలపై ఉన్న లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా నేపథ్యంలో 60 ఏళ్లకుపై బడిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలు పబ్లిక్ ప్రాంతాల్లో తిరగొద్దని జూన్ 18 నుంచి ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే..దుబాయ్ సుప్రీం కమిటీ తాజా నిర్ణయంతో ఇక నుంచి వృద్ధులు, పిల్లలు కూడా షాపింగ్ మాల్స్ లోకి వెళ్లవచ్చు. కానీ, ఫేస్ మాస్కులు ధరించి..ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందేనని సూచించారు. కనీసం రెండు మీటర్ల వ్యత్యాసం ఉండేలా భౌతిక దూరం అనుసరించాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే.. బుధవారం నాటికి 42,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా..293 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







