కోవిడ్ 19: వృద్ధులు, పిల్లలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన దుబాయ్

- June 18, 2020 , by Maagulf
కోవిడ్ 19: వృద్ధులు, పిల్లలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన దుబాయ్

దుబాయ్:లాక్ డౌన్ సాధారణ జనజీవనం దిశగా ఆంక్షలను సడలిస్తున్న దుబాయ్ సుప్రీమ్ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలపై ఉన్న లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా నేపథ్యంలో 60 ఏళ్లకుపై బడిన వృద్ధులు, 12 ఏళ్లలోపు పిల్లలు పబ్లిక్ ప్రాంతాల్లో తిరగొద్దని జూన్ 18 నుంచి ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే..దుబాయ్ సుప్రీం కమిటీ తాజా నిర్ణయంతో ఇక నుంచి వృద్ధులు, పిల్లలు కూడా షాపింగ్ మాల్స్ లోకి వెళ్లవచ్చు. కానీ, ఫేస్ మాస్కులు ధరించి..ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందేనని సూచించారు. కనీసం రెండు మీటర్ల వ్యత్యాసం ఉండేలా భౌతిక దూరం అనుసరించాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే.. బుధవారం నాటికి 42,928 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా..293 మంది చనిపోయారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com