కరోనా కు బలైపోయిన 32 మంది డాక్టర్లు..ఐఎంఎ వెల్లడి
- August 16, 2020
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసింది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, పోలీసులు, వైద్యులు ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రంలో 32 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తమిళనాడు బ్రాంచి వెల్లడించింది. అలాగే మరో 15 మంది డాక్టర్లు కూడా కోవిడ్ లక్షణాలతో చనిపోయారు. కానీ వారికి పరీక్షలు చేస్తే కరోనా నెగిటివ్ వచ్చినట్టు వారు పేర్కొన్నారు. వైద్యుల పట్ల ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు వైద్యులు.
ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో రెండో స్థానంలో ఉంది తమిళనాడు రాష్ట్రం. 3,32,105 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఇప్పటివరకు 5,641 మంది మృతి చెందారు. అలాగే 2,72,251 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 54,213 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







