కరోనా కు బలైపోయిన 32 మంది డాక్టర్లు..ఐఎంఎ వెల్లడి
- August 16, 2020
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసింది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, పోలీసులు, వైద్యులు ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రంలో 32 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తమిళనాడు బ్రాంచి వెల్లడించింది. అలాగే మరో 15 మంది డాక్టర్లు కూడా కోవిడ్ లక్షణాలతో చనిపోయారు. కానీ వారికి పరీక్షలు చేస్తే కరోనా నెగిటివ్ వచ్చినట్టు వారు పేర్కొన్నారు. వైద్యుల పట్ల ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు వైద్యులు.
ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో రెండో స్థానంలో ఉంది తమిళనాడు రాష్ట్రం. 3,32,105 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఇప్పటివరకు 5,641 మంది మృతి చెందారు. అలాగే 2,72,251 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 54,213 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!
- తెలంగాణ పోలీసింగ్లో ఏఐ వినియోగానికి కార్యాచరణ: డీజీపీ సీవీ ఆనంద్
- సీఎం చంద్రబాబును కలిసిన అపోలో ప్రీతారెడ్డి
- యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్
- భారత్ కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
- యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన సీఎం రేవంత్









