కరోనా కు బలైపోయిన 32 మంది డాక్టర్లు..ఐఎంఎ వెల్లడి
- August 16, 2020
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసింది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, పోలీసులు, వైద్యులు ఈ వైరస్ బారిన పడి మరణించారు. ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రంలో 32 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తమిళనాడు బ్రాంచి వెల్లడించింది. అలాగే మరో 15 మంది డాక్టర్లు కూడా కోవిడ్ లక్షణాలతో చనిపోయారు. కానీ వారికి పరీక్షలు చేస్తే కరోనా నెగిటివ్ వచ్చినట్టు వారు పేర్కొన్నారు. వైద్యుల పట్ల ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు వైద్యులు.
ఇక దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో రెండో స్థానంలో ఉంది తమిళనాడు రాష్ట్రం. 3,32,105 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఇప్పటివరకు 5,641 మంది మృతి చెందారు. అలాగే 2,72,251 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 54,213 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?