న్యాయ విద్యలో నాణ్యత కీలకం:టి.గవర్నర్
- August 17, 2020
హైదరాబాద్:భాగ్యదేశంలో కోర్టులలో పెరిగిపోతున్న కేసుల సంఖ్య ఆందోళన కనిగిస్తున్నదని, న్యాయ విద్యలో నాణ్యత పెంచడం కీలకాంశమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు.పెరుగుతున్న టెక్నాలజి, కుటుంబ సభ్యుల సమస్యల నుండి మొదలు అంతర్జాతీయ స్థాయి సమస్యలు కొత్త సవాళ్ళు విసురుతున్నాయి. విషయ పరిజ్ఞానం, లోతైన అవగాహన, నైపుణ్యాలున్న న్యాయ విద్యార్ధులను తీర్చిదిద్దడానికి న్యాయ విద్య పరిధి విస్తృతం కావాలని డా. తమిళిసై అన్నారు.
“న్యాయ విద్య, పరిశోధన – కోవిడ్ సమాళ్ళు” అన్న అంశంపై ఉస్మానియా యూనివర్సిటి న్యాయకళాశాల ఆధ్వర్యంలో మొదలైన 10 రోజుల ఆన్ లైన్ కార్యశాలను గవర్నర్ ముఖ్య అతిధిగా ఈరోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ మొత్తం విద్యారంగానికే సవాలు విసిరిందని, ఐతే లాక్ డౌన్ విద్యా సంస్ధలకే కానీ విద్యకు కాదన్నారు. ప్రతీ సమస్య కొన్ని కొత్త అవకాశాలను సృష్టిస్తుందని, అలాగే కోవిడ్ సంక్షోభం కూడా విద్యా రంగంలో కొత్త తరహా ఆన్ లైన్, డిజిటల్ లర్నింగ్, టీచింగ్ అవకాశాలను కల్పించిందన్నారు.
కొత్తగా వస్తన్న జాతీయస్థాయి లా స్కూల్స్ కు ధీటుగా సంప్రదాయ విశ్వవిద్యాలయ లా కళాశాలలు కూడా సిలబస్ రూపకల్పన, వసతులు సమకూర్చుకొని అత్యుత్తమ న్యాయ విద్యను అందించాలని డా. తమిళిసై పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ. సిహెచ్. గోపాల్ రెడ్డి, న్యాయ విభాగం హెడ్ ప్రొ. గాలి వినోద్ కుమార్, లా డీన్ ప్రొ. పంత్ నాయర్, ప్రొ. జిబి రెడ్డి, ప్రధాన వక్త ప్రొ. వెంకట రావ్, డా. విజయ లక్షి, డా. రాధిక యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









