ఏపీలో భారీగా కరోనా కేసులు
- August 18, 2020
ఏపీలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. తాజా బులిటెన్ ప్రకారం... ఏపీలో 3 లక్షలు దాటాయి కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9652 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06, 261కి చేరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో కొత్తగా 88 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2820కి చేరుకుంది. మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85130 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 29,61,611 టెస్ట్లు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







