సమర్ధవంతమైన సేవలకు ఈ-ఆఫీసులు అత్యంత కీలకం:తెలంగాణ గవర్నర్
- August 26, 2020
హైదరాబాద్:ఈ-ఆఫీసు విధానం ద్వారా సేవలందించడం వలన పౌరులకు సేవలందించడంలో వేగం, జవాబుదారితనం, పారదర్శకత పెంపొందుతాయని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు.ప్రభుత్వ పాలనలో సాధ్యమైనన్ని ఎక్కువ స్ధాయిలలో ఈ-ఆఫీసు పద్ధతి ద్వారా ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
ఈ-ఆఫీసు విధానంలో పేపర్ లెస్ పాలన భాగం కానట్టి చెట్లు కొట్టివేయడం తగ్గుతుందని, దీని ద్వారా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని వివరించారు.
ఈ-ఆఫీస్, ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలు తమకు కావాల్సిన చట్టబద్ధమైన సేవలు సులభతరంగా, హక్కుగా పొందుతారని ఇది వారిని సాధికారత వైపు నడిపిస్తుందని డా. తమిళిసై స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఐటి, ఈసి విభాగం జాయింట్ సెక్రటరి పెండ్యాల శ్రీనివాస్, ఇతర అధికారులు ఈ-ఆఫీస్ విధానంపై ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి శ్రీకారం చుట్టిన డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా మన దేశం ఇప్పటికే డిజిటల్ విద్య, డిజిటల్ బ్యాంకింగ్, ఈ-గవర్నెన్స్ దిశగా ముందంజలో ఉందన్నారు.
కోవిడ్-19 సంక్షోభం డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచింది. మనం డిజిటల్ యుగంలో ఉన్నాము. డిజిటల్ సాంకేతిక వినియోగంతో పాలనను, జీవితాన్ని సులభతరం చేయడానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఈ-ఆఫీస్ పాలనతో విద్యార్ధులకు సమర్ధవంతమైన, సత్వర సేవలందించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రటరి కె. సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు జె. భవానీ శంకర్, సి.ఎన్. రఘు ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







