కువైట్-ఇండియా ఫ్లైట్ షెడ్యూల్ ప్రకటించిన అల్ తాయార్ ట్రావెల్స్
- September 10, 2020
కువైట్ సిటీ:స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న కువైట్ లోని ఇండియన్ల కోసం ప్రత్యేక విమాన సర్వీసులను కొనసాగిస్తున్నట్లు అల్ తాయార్ లగ్జరీ ట్రావెల్స్ ప్రకటించింది. కువైట్ నుంచి భారత్ లోని ఆరు నగరాలకు మొత్తం ఎనిమిది సర్వీసులు నడుపుతున్నట్లు ట్రావెల్స్ ప్రతినిధులు వెల్లడించారు. ముంబై, ఢిల్లీకి రెండు సర్వీసులు, హైదరాబాద్, కొచ్చి, త్రివేండ్రం, చెన్నైకి ఒక్కో చార్టర్డ్ విమానం చొప్పున ఈ నెల 12 నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే..ప్రయాణికులు పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది.
అల్ తాయార్ సంస్థ ప్రకటించిన చార్టెర్డ్ ఫ్లైట్ షెడ్యూల్ వివరాలు :
సెప్టెంబర్ 12 - ఢిల్లీ, సెప్టెంబర్ 17- ముంబై, సెప్టెంబర్ 20- చెన్నై, సెప్టెంబర్ 22- హైదరాబాద్, సెప్టెంబర్ 21- ముంబై, సెప్టెంబర్ 25 - కొచ్చి, సెప్టెంబర్ 26-త్రివేండ్రం, సెప్టెంబర్ 30- ఢిల్లీకి ప్రత్యేక విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారి కోసం పలువురు ఆపరేటర్లను ఫోన్ నెంబర్ల కూడా ట్రావెల్స్ సంస్థ వెల్లడించింది. వసీం - 99696767, యాసర్ - 67041981, సలీమ్ - 97122364, యూసుఫ్ - 96677516, లినెట్-99691151, అతుల్ - 97313355 , మాథ్యు - 99696769కి ఫోన్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!