కువైట్-ఇండియా ఫ్లైట్ షెడ్యూల్ ప్రకటించిన అల్ తాయార్ ట్రావెల్స్
- September 10, 2020
కువైట్ సిటీ:స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న కువైట్ లోని ఇండియన్ల కోసం ప్రత్యేక విమాన సర్వీసులను కొనసాగిస్తున్నట్లు అల్ తాయార్ లగ్జరీ ట్రావెల్స్ ప్రకటించింది. కువైట్ నుంచి భారత్ లోని ఆరు నగరాలకు మొత్తం ఎనిమిది సర్వీసులు నడుపుతున్నట్లు ట్రావెల్స్ ప్రతినిధులు వెల్లడించారు. ముంబై, ఢిల్లీకి రెండు సర్వీసులు, హైదరాబాద్, కొచ్చి, త్రివేండ్రం, చెన్నైకి ఒక్కో చార్టర్డ్ విమానం చొప్పున ఈ నెల 12 నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే..ప్రయాణికులు పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది.
అల్ తాయార్ సంస్థ ప్రకటించిన చార్టెర్డ్ ఫ్లైట్ షెడ్యూల్ వివరాలు :
సెప్టెంబర్ 12 - ఢిల్లీ, సెప్టెంబర్ 17- ముంబై, సెప్టెంబర్ 20- చెన్నై, సెప్టెంబర్ 22- హైదరాబాద్, సెప్టెంబర్ 21- ముంబై, సెప్టెంబర్ 25 - కొచ్చి, సెప్టెంబర్ 26-త్రివేండ్రం, సెప్టెంబర్ 30- ఢిల్లీకి ప్రత్యేక విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారి కోసం పలువురు ఆపరేటర్లను ఫోన్ నెంబర్ల కూడా ట్రావెల్స్ సంస్థ వెల్లడించింది. వసీం - 99696767, యాసర్ - 67041981, సలీమ్ - 97122364, యూసుఫ్ - 96677516, లినెట్-99691151, అతుల్ - 97313355 , మాథ్యు - 99696769కి ఫోన్ చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







