కర్నాటకలో లక్ష మార్కు దాటిన కరోనా కేసుల సంఖ్య
- September 10, 2020
బెంగుళూరు:కర్నాటకలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతీరోజూ వంద మందికి పైగా కరోనా కాటుకి బలైపోతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,217 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,30,947కు చేరింది. ఈ ఒక్కరోజే కరోనాతో 129 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 6,937కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,22,454 మంది కోలుకోగా.. ఇంకా 1,01,537 మంది చికిత్స పొందుతున్నారు. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







