మరోసారి గొప్ప మనసు చాటుకున్న ‘డిగ్రీ కాలేజ్’ హీరో
- September 12, 2020
హైదరాబాద్:కరోనా మహ్మమారి కారణంగా ఎందరో ఉపాధి కోల్పోయారు. అలాంటివారిని మరెందరో మానవత్వంతో ముందుకు వచ్చి.. కష్టకాలంలో సాయం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే.. పేద కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సీసీసీ మనకోసం పేరిట ఓ సంస్థను స్థాపించి.. ఇప్పటికే మూడు విడతలు సాయం అందించారు. అలాగే సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులెందరో.. ఈ కరోనా కష్టకాలంలో ముందుకు వచ్చి.. పేదలకు సాయం చేశారు. అందులో ‘డిగ్రీ కాలేజ్’హీరో వరుణ్ కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి తనవంతు సహాయం అందిస్తూనే ఉన్నారు.
కాస్త కరోనా ఉదృతి తగ్గి.. పరిస్థితులు ఇప్పడిప్పుడే మెరుగుపడుతున్నాయి. కానీ వరుణ్ మాత్రం ఇప్పటికీ సహాయ కార్యక్రమాలు అందిస్తూనే ఉన్నారు. ఈ విపత్తులో ఆయన ఎందరికో నిత్యావసర సరుకులు అందించారు. యూనియన్ కార్డ్లేని సినీ ఆర్టిస్ట్ లకు, రోడ్డుపై ఉండే నిరుపేదలకు ఇలా తనకు సాధ్యమైనంతగా సహాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పరిసరాల్లోని పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్క్, శానిటైజర్స్ అందించి మరోసారి తన ఉదాత్త హృదయాన్ని చాటుకున్నారు.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







