ప్రధాని మోదీపై WHO ప్రశంసలు
- September 27, 2020జెనీవా:వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్.. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం జరిగిన 75వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడంలో భారత్ కృషి చేస్తుందని అన్నారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలపై టెడ్రోస్ ఆయనను ట్విట్టర్ వేదికగా అభినందించారు. కరోనా పోరాటంలో ప్రపంచ దేశాలకు మద్దతుగా నిలుస్తున్న మోదీకి ధన్యవాదాలని టెడ్రోస్ తెలిపారు. కరోనా కాలంలో భారత్ ప్రపంచ దేశానికి మందులు సరఫరా చేసినా విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ దేశాలన్నీ ఇలాగే కలసికట్టుగా ఉండి సహకారం అందించుకోవాలని, అప్పుడే కరోనా వైరస్ను అంతమొందించగలమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!