భారత రాయబారితో సయ్యిద్‌ తెయాజిన్‌ సమీక్ష

- September 28, 2020 , by Maagulf
భారత రాయబారితో సయ్యిద్‌ తెయాజిన్‌ సమీక్ష

మస్కట్‌:మినిస్టర్‌ ఆఫ్‌ కల్చర్‌, స్పోర్ట్స్‌ అండ్‌ యూత్‌ సయ్యిద్‌ తెయాజిన్‌, భారత రాయబారి మును మహావర్‌కి ఘనంగా స్వాగతం పలికారు. మినిస్ట్రీ కార్యాలయంలో భారత రాయబారితో సమావేశమయిన సయ్యిద్‌ తెయాజిన్‌, ఇరు దేశాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి పలు అంశాలపై ఈ సందర్భంగా సమీక్ష జరిగింది. కల్చరల్‌, స్పోర్ట్స్‌ అండ్‌ యూత్‌ విభాగాల్లో పరస్పర సహకారం మరింత పెరగాలని ఇరువురూ ఆకాంక్షించారు. సుల్తానేట్‌ అలాగే ఇండియా, 2010 జులైలో కల్చరల్‌ కో-ఆపరేషన్‌ విభాగంలో ఎంఓయూపై సంతకాలు చేసిన విషయం విదితమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com