కువైట్: అక్టోబర్ 2 వరకు ఇండియన్ ఎంబసీ, పాస్ పోర్ట్ కేంద్రాల మూసివేత
- September 30, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారత్ రాయబార కార్యాలయంలో అక్టోబర్ 2 వరకు ప్రజా సేవలను నిలిపివేశారు. అలాగే షార్క్, ఫహహీల్, అబ్బాసియాలో ఉన్న పాస్ పోర్ట్ కార్యాలయాలను కూడా మూడ్రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ అమీర్ షేక్ సాబా అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సాబా మృతికి సంతాపంగా మూడ్రోజులు ఆయా కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. ఇదిలాఉంటే..భారత ప్రభుత్వం, భారత ప్రజల తరపున కువైట్ అమీర్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







