కువైట్: అక్టోబర్ 2 వరకు ఇండియన్ ఎంబసీ, పాస్ పోర్ట్ కేంద్రాల మూసివేత

- September 30, 2020 , by Maagulf
కువైట్: అక్టోబర్ 2 వరకు ఇండియన్ ఎంబసీ, పాస్ పోర్ట్ కేంద్రాల మూసివేత

కువైట్ సిటీ:కువైట్ లోని భారత్ రాయబార కార్యాలయంలో అక్టోబర్ 2 వరకు ప్రజా సేవలను నిలిపివేశారు. అలాగే షార్క్, ఫహహీల్, అబ్బాసియాలో ఉన్న పాస్ పోర్ట్ కార్యాలయాలను కూడా మూడ్రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ అమీర్ షేక్ సాబా అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సాబా మృతికి సంతాపంగా మూడ్రోజులు ఆయా కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. ఇదిలాఉంటే..భారత ప్రభుత్వం, భారత ప్రజల తరపున కువైట్ అమీర్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. ​

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com