కువైట్: అక్టోబర్ 2 వరకు ఇండియన్ ఎంబసీ, పాస్ పోర్ట్ కేంద్రాల మూసివేత
- September 30, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారత్ రాయబార కార్యాలయంలో అక్టోబర్ 2 వరకు ప్రజా సేవలను నిలిపివేశారు. అలాగే షార్క్, ఫహహీల్, అబ్బాసియాలో ఉన్న పాస్ పోర్ట్ కార్యాలయాలను కూడా మూడ్రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ అమీర్ షేక్ సాబా అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సాబా మృతికి సంతాపంగా మూడ్రోజులు ఆయా కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. ఇదిలాఉంటే..భారత ప్రభుత్వం, భారత ప్రజల తరపున కువైట్ అమీర్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







