సౌదీ:ఫుడ్ పాయిజన్ తో 200 మందికి అస్వస్థత...20 మందికి ఆస్పత్రిలో చికిత్స

- October 05, 2020 , by Maagulf
సౌదీ:ఫుడ్ పాయిజన్ తో 200 మందికి అస్వస్థత...20 మందికి ఆస్పత్రిలో చికిత్స

సౌదీ అరేబియా లోని అల్ బాహ ప్రాంతంలో ఓ రెస్టారెంట్లో విషాహారం తిని 200 మంది అస్వస్థతకు గురయ్యారు.అల్ బాహ ప్రాంతంలోని అల్ అకిక్ గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత కస్టమర్ల ఒంట్లో అస్వస్థతగా ఉండటంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. వాంతులు, తలతిరగటం వంటి లక్షణాలు కనిపించటంతో వాళ్లందర్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే..175 మందిని ప్రాధమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేసిన ఆస్పత్రి సిబ్బంది..మరో 20 మందికి మాత్రం కొనసాగిస్తున్నారు. ఇందులో ఐదుగురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com