ఖతార్‌లో కొత్తగా 235 కరోనా పాజిటివ్‌ కేసులు

- November 13, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా 235 కరోనా పాజిటివ్‌ కేసులు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 235 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 132,356కి చేరుకుంది. కాగా, 235 కొత్త కేసుల్లో 195 కమ్యూనిటీ కేసులు కాగా, 30 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు. ఇప్పటివరకు కరోనాతో 234 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 4770 మందికి కరోనా టెస్టులు చేయడం జరిగింది. ఇప్పటివరకు జరిగిన టెస్టుల సంఖ్య 1,040,710. ఖతార్‌లో మొత్తంగా నమోదైన పాజిటివ్‌ కేసులు 135,367. ప్రస్తుతం 2777 యాక్టివ్‌ కేసులున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com