ఈ నెల 7 నుంచి డొమస్టిక్ వర్కర్లకు అనుమతి..కువైట్ మంత్రివర్గం నిర్ణయం
- December 01, 2020
కువైట్ సిటీ:కోవిడ్, ప్రయాణ ఆంక్షలతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన డొమస్టిక్ వర్కర్లు ఇక కువైట్ వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 7 నుంచి డొమస్టిక్ వర్కర్లు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కువైట్ అధికార ప్రతినిధి తారీఖ్ అల్ ముజ్రిమ్ మంత్రిమండలి నిర్ణయాన్ని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో డొమస్టిక్ వర్కర్లకు సంబంధించి మార్గనిర్దేశకాలను కూడా వెల్లడించారు. వివిధ దేశాల నుంచి కువైట్ కు వచ్చే ఒక్కో గృహ కార్మికుడు క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ పాటు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకుగాను ఒక్కో కార్మికుడు 270 దినార్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ మొత్తాన్ని విమాన టికెట్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,దివాకర్)
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







