ఈ నెల 7 నుంచి డొమస్టిక్ వర్కర్లకు అనుమతి..కువైట్ మంత్రివర్గం నిర్ణయం
- December 01, 2020
కువైట్ సిటీ:కోవిడ్, ప్రయాణ ఆంక్షలతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన డొమస్టిక్ వర్కర్లు ఇక కువైట్ వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 7 నుంచి డొమస్టిక్ వర్కర్లు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కువైట్ అధికార ప్రతినిధి తారీఖ్ అల్ ముజ్రిమ్ మంత్రిమండలి నిర్ణయాన్ని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో డొమస్టిక్ వర్కర్లకు సంబంధించి మార్గనిర్దేశకాలను కూడా వెల్లడించారు. వివిధ దేశాల నుంచి కువైట్ కు వచ్చే ఒక్కో గృహ కార్మికుడు క్వారంటైన్, పీసీఆర్ టెస్ట్ పాటు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకుగాను ఒక్కో కార్మికుడు 270 దినార్లు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఈ మొత్తాన్ని విమాన టికెట్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,దివాకర్)
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!