సినారె పాటకు పట్టాభిషేకం
- January 12, 2021
అమెరికా గానకోకిల శారద ఆకునూరి నిర్వహణలో, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా సహకారంతో వంశీ ఇంటర్నేషనల్ అమెరికా-ఇండియా మరియు యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్, లండన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఐదవ ప్రపంచ వంశీ సంగీత సాహిత్య సమ్మేళనంలో 58 ఆణిముత్యాల్లాంటి సి నారాయణ రెడ్డి పాటలతో "సి నా రె పాటకు పట్టాభిషేకం" అద్భుతంగా నిర్వహించారు..

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వర్ణ యుగ ప్రజా నటి కళా భారతి డాక్టర్ జమునా రమణారావు మాట్లాడుతూ ఇలా అన్నారు..

"పద్మభూషణ్, జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి గేయ రచయితగా అడుగిడి 58 సంవత్సరాలు అయిన సందర్భంగా లిటిల్ మ్యుజిష్యన్స్ అకాడమీ, హైదరాబాద్ వ్యవస్థాపకులు కె.రామాచారి ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న వారి శిష్యులు, సి నా రె రచించిన పాటలను ఆలపించి ఆ మహా కవికి ఘన నివాళి అర్పించటం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు జరిగిన పట్టాభిషేకంగా భావిస్తున్నాను.. గులేబకావళి కధ చిత్రంలో సి నా రె వ్రాసిన "నన్ను దోచుకుందువటే" తొలి గేయానికి తాను అభినయించడం మరపురాని మధురమైన అనుభూతిని, ఇప్పటికీ ఆ గానాన్ని పాడని గాయనీ గాయకులు ఉండరనీ సంగీత విభావరి వుండదనీ సినారెను ఆమె ప్రశంసించారు..

"తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళలకు ఇస్తున్న ప్రాధాన్యత మరువ లేనిదని" అంటూ ముఖ్యమంత్రి KCR ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు..

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, మామిడి హరికృష్ణ , ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు , ప్రముఖ సినీ నేపధ్య గాయకులు G.ఆనంద్ , ప్రముఖ సినీ గేయ రచయితలు సిరాశ్రీ మరియు రామజోగయ్య శాస్త్రి పాల్గొని వారి అమృత తుల్యమైన సందేశాలను అందించారు..

ఈ కార్యక్రమాన్ని డాక్టర్ V. P కిల్లి, యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్, లండన్, వంశీ సంస్థల వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజుగారు మరియు ఆ సంస్థల మానేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ నిర్వహించారు..

తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







