ఇండోనేషియా ప్రమాదం.. దొరికిన బ్లాక్ బాక్స్
- January 12, 2021
జకర్తా: ఇండోనేషియా సమీపంలోని జావా నదిలో శ్రీవిజయ ఎయిర్ జెట్కు చెందిన విమానం కూలిన ఘటనలో 62 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానానికి చెందిన బ్లాక్ బాక్సును డైవర్లు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. విమానం కూలిన ప్రాంతంలో వెతికిన డైవర్లు బ్లాక్ బాక్సు దొరికినట్లు సమాచారం. అయితే అది ఫ్లయిట్ డేటా పరికరమా లేక కాక్పిట్ వాయిస్ రికార్డరా అన్న విషయం స్పష్టంగా తెలియదు. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణాన్ని విశ్లేషించేందుకు బ్లాక్ బాక్సు డేటా కీలకం కానున్నది. శనివారం రోజున జకర్తా నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లో భారీ వర్షంలో విమానం సమీప సముద్రంలో కూలిపోయింది. బాక్ల్ బాక్సు కోసం సుమారు 160 మంది డైవర్లు సముద్రంలో అన్వేషించారు. విమానం కూలిన ప్రాంతంలో సుమారు 3600 మంది రెస్క్యూ సిబ్బంది, 13 హెలికాప్టర్లు, 54 భారీ నౌకలు, 20 చిన్న బోట్లతో గాలింపు చర్యలు సాగుతున్నాయి.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







