కువైట్ లో ఎన్ టి ఆర్ జయంతి వేడుకలు

- May 29, 2015 , by Maagulf
కువైట్ లో ఎన్ టి ఆర్ జయంతి వేడుకలు

 

 

ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ గౌ.శ్రీ.కోడెల శివప్రసాద్‌ గారు అందరిని ఎంతో ఆప్యాయం గా పలకరించారు.అనంతరం ఎన్ టి ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి, కేక్ కట్ చేసారు. శివ ప్రసాద్ గారు ప్రసంగిస్తూ ఎన్ టి ఆర్ గారితో ఆయనకు ఉన్న సంబంధాన్ని మరియు ఆయనతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఎన్ టి ఆర్ గారి ఉన్నత లక్షణాలను సభలో వారికి వివరించారు. తన రాజకీయ జీవితం లో మహానాడు హాజరు కాక పోవటం కాస్తంత బాధ కరమయినను,కువైట్ లో టి డి పి వారు నిర్వహిస్తున్న ఈ మహానాడు కు ముఖ్య అతిధి గా విచ్చేయటం ఎంతో ఆనందం గా ఉందని చెప్పారు. పెద్ద సంక్య లో విచ్చేసిన తెలుగు తమ్ముళ్ళకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం విందు లో పాల్గుని కార్యకర్తల తో తెలుగు వారి సమస్యలని తెలుసుకున్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com