27 రోజుల్లో 9,271 మంది ప్రవాసీయుల వర్క్ పర్లిట్లు రద్దు చేసిన కువైట్
- February 09, 2021
కువైట్ సిటీ :ప్రవాస కార్మికులకు షాక్ ఇచ్చింది కువైట్ ప్రభుత్వం. కేవలం 27 రోజుల వ్యవధిలో ఏకంగా 9,271 మంది ప్రవాసీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. అదే సమయంలో 362 మందికి కొత్తగా వర్క్ పర్మిట్లను జారీ చేసినట్లు మానవ వనరుల అధికార విభాగం తమ తాజా గణాంకాల్లో వెల్లడించింది. రద్దు చేసిన వర్క్ పర్మిట్లలో 4999 మంది ప్రస్తుతం కువైట్లో లేరని తెలిపింది. అయితే..అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలతో వాళ్లంత ఇతర దేశాల్లో చిక్కుకుపోయి కువైట్ రాలేదు. అలా విదేశాల్లో ఉండిపోయి..రెసిడెన్సీ వీసాల గడువు ముగిసిన వారి వర్క్ పర్మిట్లు రద్దు చేసినట్లు వివరించింది. 555 మంది వలస కార్మికులు మృతి చెందారని, దేశం విడిచి వెళ్లిన 3,534 మంది వలస కార్మికులు వర్క్ పర్మిట్లను రద్దు చేసినట్లు తెలిపారు. మరో 183 మంది తమ వీసాలను ఫ్యామిలీ వీసాలుగా బదిలీ చేసుకున్నట్లు మానవ వనరుల శాఖ వివరించింది. ఇదిలాఉంటే..గత నెల 24 నుంచి కొత్త వర్క్ పర్మిట్లను జారీ చేయటం ప్రారంభించిన కువైట్ ఇప్పటివరకు 362 మంది పర్మిట్లను జారీ చేసిందని..అయితే, అవన్ని మంత్రి మండలి ఆమోదం తర్వాతే అనుమతించినవని ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!







