ఎట్టకేలకు సుల్తానేట్లోకి ఒంటెల రవాణాకు అనుమతించిన ఒమన్
- February 13, 2021
మస్కట్:సుల్తానేట్ సరిహద్దుల అవతల చిక్కుకుపోయిన ఒంటెలను దేశంలోకి అనుమతించేందుకు ఎట్టకేలకు ఒమన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రటకన విడుదల చేసింది. దీంతో చాన్నాళ్లుగా సరిహద్దు అవతలే ఉండిపోయిన ఒంటెలను ఎట్టకేలకు ఒమన్లోకి తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. అంతేకాదు..ఒంటెల ఓనర్లకు, ఒంటెలను రవాణా చేసే క్యారియర్లపై విధించే అన్ని జరిమానాల నుంచి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది వచ్చే మార్చి వరకు మినహాయింపు కాలంగా స్పష్టం చేసింది. ఇన్నాళ్లు వైరస్ మహమ్మారి భయంతో దేశంలోకి అనుమతులపై ఆంక్షలు విధించటంతో చాలా వరకు ఒంటెలు, ఒంటెల రవాణా చేసే క్యారియర్లు సరిహద్దులోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే..ఇప్పుడు ఒంటెలను దేశంలోకి అనుమతిస్తున్నా...వాటిని ఏ కారణం చేత సరిహద్దు దాటించారనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫామ్ ను సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ







