ఏపీలో కరోనా కేసుల వివరాలు

- February 28, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,122 కరోనా టెస్ట్‌లు నిర్వహించగా... 117 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 66 మంది కరోనాబారి నుంచి కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.అయితే, ఇవాళ ఎలాంటి కరోనా డెత్ కేసు నమోదు కాలేదు.. మొత్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య 8,89,916కు చేరగా... 8,82,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు 7,169 మంది కరోనాతో మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 718 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com