ఫేక్ కరెన్సీని విసిరిన వ్యక్తి అరెస్ట్, భారీ జరీమానా
- March 01, 2021
దుబాయ్:దుబాయ్లో ఓ వ్యాపారవేత్తకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అతనికి 200,000 దిర్హాముల జరీమానా కూడా విధించడం జరిగింది. యూరోప్కి చెందిన వ్యక్తిగా నిందితుడ్ని గుర్తించారు. 500 యూరో ఫేక్ బిల్స్ని నిందితుడు తన కారు నుంచి బయటకు విసిరివేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫాలోవర్స్ని పెంచుకోవడమే లక్ష్యంగా నిందితుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. అల్ కోజ్ ఇండస్ర్టియల్ ఏరియాలో నిందితుడు ఫేక్ కరెన్సీని కారు నుంచి బయటకు విసిరివేసినట్లు అతను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుడు విచారణ సందర్భంగా తన నేరాన్ని అంగీకరించాడు. 740,000 ఫేక్ యూఎస్ డాలర్లను నిందితుడు పొందగలిగాడని, యూరో బిల్స్ను ఆసియాకి చెందిన వ్యక్తి నుంచి 1,000 దిర్హాములకు నిందితుడు కొనుగోలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







